Ap Politics:ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు

by Disha Web Desk 18 |
Ap Politics:ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు
X

దిశ,చంద్రగిరి:నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీని పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా, వైసీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముడిపల్లి సురేష్, సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త రమణమూర్తి, నంగా నితిన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, విక్కీ, ప్రసన్న తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.

టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా, నంగా బాబు రెడ్డి దంపతులు మాట్లాడుతూ కష్టపడిన వారికి వైసీపీలో తగిన గుర్తింపు లేదని, ఎమ్మెల్యే పీఏలు, పిఆర్ఓ పెత్తనం ఎక్కువైందని విమర్శనాస్త్రాలు ప్రోటోకాల్ కూడా పాటించకుండా అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. 5 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేక పోయామని పార్టీలో ఉత్సవ విగ్రహాల్లా ఉండలేకే వైసీపీకి గుడ్ బై చెబుతున్నామని తెలియజేశారు. పులివర్తినాని ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసిన వారిలో టీడీపీ సీనియర్ నేత కుమారుడు రాజా రెడ్డి, చంద్రగిరి మండలం పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు ఉన్నారు.

Next Story

Most Viewed